నూతన భూ క్రమబద్దీకరణ పథకంపై ప్రభుత్వం పునారాలోచించాలని రియల్టర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎల్ఆర్ఎస్ జీవో 131ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రియల్టర్లు హయత్ నగర్, నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు దర్నా నిర్వహించారు. అనంతరం ఉప్పల్ డిపో నుండి మేడిపల్లి మీదుగా నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.