సైబర్ నేరాల కారణంగా 2019లో రూ.1.25 లక్షల కోట్ల నష్టం ఏర్పడినట్టు ‘నేషనల్ సైబర్ సెక్యూరిటీ’ కోఆర్డినేటర్ లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పంత్ తెలిపారు. స్మార్ట్ పట్టణాల అభివృద్ధిని చేపట్టడంతోపాటు 5జీ నెట్వర్క్ను అమల్లోకి తీసుకురావడం వల్ల భవిష్యత్తులోనూ సైబర్ నేరాల ముప్పు పెరిగే అవకాశం ఉందన్నారు. భారత్లో కేవలం కొన్ని కంపెనీలే సైబర్ భద్రతా ఉత్పత్తులను తయారు చేస్తున్నాయంటూ.. ఈ రంగంలో ఎంతో శూన్యత నెలకొందన్నారు. విశ్వసనీయమైన దేశీయ పరికరాల అభివృద్ధి ద్వారా సైబర్ దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రంగానికి సంబంధించి ఒక ఫోరమ్ అవసరాన్ని రాజేష్ పంత్ గుర్తు చేశారు.