జమ్మూకాశ్మీర్లో చలి పంజా విసురుతోంది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 30 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. తీవ్రమైన చలికి కాశ్మీర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు మొత్తం గడ్డకట్టుకుపోయింది. ఉష్ణోగ్రతలు మైనస్ 8.4 డిగ్రీలకు చేరగా.. 1991 తర్వాత కాశ్మీర్లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. జనవరి, 1991లో మైనస్ 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరశాఖ అధికారులు తెలుపారు. 1893లో శ్రీనగర్లో కనిష్ఠ ఉష్ణోగత్ర మైనస్ 14.4 డిగ్రీలని చెప్పారు. ఇదిలా ఉండగా.. తీవ్రమైన చలికి లోయ ప్రాంతం వణికిపోతోంది. దక్షిణ కాశ్మీర్లోని వార్షిక అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్గా పని చేస్తున్న పహల్గామ్లో కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 11.1 డిగ్రీలకు చేరింది. అంతకు ముందు రాత్రి మైనస్ 11.7 డిగ్రీలను తాకింది. గుల్మార్గ్ పర్యాటక ప్రాంతంలో మైనస్ 7 డిగ్రీల వద్ద స్థిరపడింది. ఉత్తర కాశ్మీర్లో కుప్వారాలో మైనస్ 6.7, కోకర్నాగ్లో కనిష్ఠ స్థాయి మైనస్ 10.3 డిగ్రీల సెల్సియస్. చలితో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైపుల్లో నీరంతా గడ్డకట్టుకుపోయింది. కాశ్మీర్తో పాటు లోయలో దట్టమైన మంచు కప్పివేడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.