హైదరాబాద్: కేంద్ర యువజన, క్రీడా శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకేఎస్) వలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్లో భాగంగా పదో తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా 13,206 వలంటీర్లను నియమిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
దేశవ్యాప్తంగా 623 కేంద్రాల్లో ఒక్కో బ్లాక్కు ఇద్దరు చొప్పున వలంటీర్లను నియమిస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి రెండు మండలాలకు ఒక వలంటీర్ ఉంటారు. వీరితో పాటు ప్రతీ కేంద్రంలో కంప్యూటర్, డాక్యుమెంటేషన్ పని కోసం ఇద్దరు వాలంటీర్లు ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్ 1న విధుల్లో చేరాలి.
మొత్తం పోస్టులు: 13,206
అర్హతలు: పదో తరగతిలో ఉత్తీర్ణులవ్వాలి. 2021 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 29 ఏండ్లలోపు ఉండాలి. ఎంపికైనవారికి రూ.5000 గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు ఆధార్కార్డు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: ఫిబ్రవరి 20
ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు
ఇంటర్వ్యూ ఫలితాలు: మార్చి 15
వెబ్సైట్: https://nyks.nic.in/