గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ), టాలెంట్ స్ప్రింట్ అనే సంస్థ సంయుక్తంగా ఐవోటీ అండ్ స్మార్ట్ అనలిటిక్స్లో పీజీ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించాయి. ఈ మేరకు ట్రిపుల్ ఐటీ, టాలెంట్ స్ప్రింట్ వెల్లడించాయి. 9 నెలల కాలవ్యవధి కలిగిన ఈ కోర్సుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపాయి. ఐవోటీ ఇంజినీర్లు, అనలిటిక్స్లో ప్రావీణ్యం పొందాలనుకునే వారికి ఈ కోర్సు ఉపయుక్తంగా ఉంటుందని, ఈ కోర్సుకు జూన్ నుంచి తరగతులను ప్రారంభిస్తామని తెలిపాయి. ఎంపిక చేయబడిన కొద్ది మంది గ్రాడ్యుయేట్లు కూడా ఈ కోర్సులో చేరుతారని, అందరికీ ప్రత్యక్ష, ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు iiit-h.talentsprint.comi/iot/ అనే వెబ్సైట్ను సందర్శించవచ్చని తెలిపాయి.