కాంట్రాక్ట్ రీసర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన జీవీకే బయోసైన్సెస్లో గోల్డ్మన్ శాక్స్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అడ్వైజర్గా వ్యవహరిస్తోంది.
ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్ పూర్తి అయితే గోల్డ్మన్ శాక్స్కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్మన్ శాక్స్ 2020 నవంబరులో బయోకాన్కు చెందిన బయోకాన్ బయాలాజిక్స్లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్లో జీవీకే కుటుంబానికి, డీఎస్ బ్రార్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది.