భారీ మొత్తంలో 'విద్యుత్తు' పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
వెయ్యి జూనియర్ లైన్మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు.
సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తులు సహా ఇతర వివరాల కోసం https://tssouthernpower.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలనిధికారులు సూచించారు
సంస్థ పరిధిలోని నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుదారులు రూ. 200 ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయించారు. వీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.
విద్యార్హతలు: ఎస్సెస్సీతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్, వైర్మెన్ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పాసై ఉండాలి.
వయస్సు: 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.